అమరావతి: వైసిపి కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో శనివారం ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో రిబ్బన్ కట్ చేయించి ప్రారంబోత్సవం చేయించారు. కార్యాలయ ఆవరణలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల కాలం వరకూ వైసిపి కేంద్ర కార్యాలయం హైదరాబాదు లోటస్ పాండ్లో కొనసాగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జగన్మోహనరెడ్డి తాడేపల్లికి మకాం మార్చిన విషయం తెలిసిందే. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం సమీపంలోనే ఓల్డ్ టోల్ గేట్ ఎదురుగా రెండు ఎకరాల స్థలంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కేంద్ర పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
previous post
next post