నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న గరుత్మంతుడి విగ్రహానికి వైసిపి జండా రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గ్రామ సచివాలయ భవనాలు, పాఠశాలల గోడలు, స్మశానవాటికలు, ఓవర్ హెడ్ ట్యాంక్లు ఇలా ప్రభుత్వ నిర్మాణాలపై వైసిపి జండా రంగులు వేయడంపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా కొడవవలూరు గ్రామంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న గరుత్మంతుడి విగ్రహానికి వైసిపి రంగులు వేయడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుగా వెలుగులోకి తీసుకువచ్చింది.ఇలా చేయడం అపచారం, అరిష్టమని భక్తులు పేర్కొంటున్నారు.
విగ్రహాలపై ఈ విధమైన రంగులు వేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని సమాచారం. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతోంది.