అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న గోదావరి నదిలో జరిగిన లాంచీ మునక తొలి పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 12మంది మృతి చెందగా గల్లంతైన మరో 20మందికి పైగా పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది. 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తక్షణం స్పందించారు. వెంటనే మంత్రులను ఘటనా స్థలానికి పంపడంతో పాటు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. తక్షణం పర్యాటక బోట్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున జగన్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే ఇంత వరకూ అంతా బాగానే ఉంది.
అయితే ఈ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని గానీ, పర్యాటక శాఖ మంత్రి రాజీనామా చేయాలని కానీ ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేయలేదు.
ఈ ఘటన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోదావరి నదిలో దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంపై నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తదితరులు చేసిన విమర్శలు, డిమాండ్లు, ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ వ్యాఖ్యలను ప్రస్థావిస్తూ వైసిపి నేతలను విమర్శిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే దేవీపట్నం వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 40మంది వరకూ మృత్యువాత పడ్డారని జగన్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సిఎం చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ను జరపాలని జగన్ డిమాండ్ చేసినట్లు సాక్షి పత్రిక పేర్కొన్నది. నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా నాటి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను భర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
నాటి పత్రికా ప్రకటనలు, నాడు రోజా మాట్లాడిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడేమి మాట్లాడతారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన వారు ఇప్పుడు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ప్రమాదం జరిగిన బోటుకు అనుమతి లేదని స్వయంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించడంతో అనుమతి లేకుండా బోట్లు తిరుగుతుంటే అధికారులు లంచాలు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
Difference in cheap ( @VSReddy_MP ) and quality ( @naralokesh ) clearly visible in ur tweets.
Wish U good luck.#ysjaganfailedascm #YSJaganFailedCM https://t.co/MrxvQgKgaH pic.twitter.com/2MErlGej7h
— KHAIDI NO : 6093 (@SAYNOTOYSRCP) September 15, 2019
గోదావరి ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ ఎవరెవరు రాజీనామాలు చేస్తున్నారు..? YCP భాషలో చెప్పాలంటే .. "ఈ హత్యలు ఎవరు చేసినట్టు"..? @VSReddy_MP @ysjagan గత ప్రభుత్వంలో ఏచిన్న పొరపాటు జరిగినా లబో-దిబో మంటూ గుండెలు బాదుకున్న 'రోజా' ఈరోజు ఘటనపై బాదుకోలేదే..? ముఖ్యమంత్రి రాజీనామాను కొరలేదే..? pic.twitter.com/TuiF2GPM0z
— Abdul Gafoor (@AbdulGafoorGNT) September 15, 2019
https://twitter.com/Usrinivasu1/status/1173281778783490048