అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని… తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మరోవైపు, ఏపీలో తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని, నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా స్కెచ్ వేశారని వ్యాఖ్యానించారు. అందుకే, ముందు నుంచి బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.
‘విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట. నిజంగా లోకేశ్ తిండే ఆ స్థాయిలో ఉంటుందా? ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా? వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం రూ.25 లక్షల భత్యంతో నెల రోజులు గడుపుతుంది’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
తెలంగాణా కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను పంపించి ఆ పార్టీని కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏపీలో తన పార్టీని బిజెపిలో విలీనం చేసి @naralokesh ను అధ్యక్షుడిగా నియమించేలా స్కెచ్ వేశాడు. మొదటి నుంచి బిజెపీ జెండా మోస్తున్న వారిని ఎదగకుండా అడ్డుకున్నది అందుకే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 24, 2019
విశాఖ ఎయిర్ పోర్టులో @ncbn గారి పుత్రరత్నం లోకేశ్ స్నాక్స్ ఖర్చు రూ.25 లక్షలట. నిజంగా @naralokesh తిండే ఆ స్థాయిలో ఉంటుందా? ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి దొంగ బిల్లులు సృష్టించాడా? వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామం రూ.25 లక్షల భత్యంతో నెల రోజులు గడుపుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 24, 2019