కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారనీ, వసూలు చేసిన డబ్బులను నేతలకు ఇస్తున్నారనీ అయన ఆరోపించారు. వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇష్టం లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోవాలని బాలనాగిరెడ్డి సూచించారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన బాలనాగిరెడ్డి వాలంటీర్ల పై ఆరోపణలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేయడంపై ప్రభుత్వం ఎ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.