అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో దీక్షా శిబిరాన్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సందర్శించి సంఘీభావం తెలిపారు.కడప వైసీపీ విద్యార్థి విభాగం నేతలు మూడు రాజధానులకు మద్దతుగా. భిక్షాటన, అర్థ నగ్న ప్రదర్శనతో నిరసన నిర్వహించారు. బస్సులు, కార్ల అద్దాలు శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో విద్యార్థులు తమ నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో మూడు రాజధానులకు మద్దతుగా నేతలు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ముమ్మిడివరంలో నిరాహార దీక్షలు చేయగా పిఠాపురంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వంహించారు. ఈ కార్యమాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించారు. అదే విధంగా రాజమండ్రి, తాడేపల్లిగూడెం, గుంటూరు, చిలకలూరిపేట, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, విశాఖపట్నం, గాజువాక, అనంతపురం జిల్లా రాయదుర్గం, తిరుపతిలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ‘మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం’ అనే అంశంపై మేధావులు, కార్మికులు, రచయితలు, వ్యాపారులు పలు సంఘాలుతో చర్చా వేదిక నిర్వహించారు.
previous post