(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆ ఇద్దరు ఒకటే పార్టీ. ఒకరు మంత్రి. మరొకరు అదే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. కానీ ఆ మంత్రి అమరావతి రాజధాని రాజధానిపై చేసిన వ్యాఖ్యలు ఆ ఎంపికి ఆగ్రహాన్ని తెప్పించాయి. గత కొద్ది రోజులుగా వైసీపీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలను విమర్శిస్తూ వచ్చిన రెబల్ ఎంపి కె రఘు రామ కృష్ణం రాజు నేడు ఆ పార్టీ మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. ఎందుకంటే…
అమరావతి ప్రాంతంలో 55వేల మంది పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి ఒప్పుకోకపోతే అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండనివ్వమనీ, దాన్ని తరలిస్తామనీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రెబర్ ఎంపి రఘురామకృష్ణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాజధాని మొత్తాన్ని విశాఖకు తరలించాలన్న ఆలోచనలో ఉన్నట్టుంది అని రఘురామకృష్ణంరాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు. పూర్తిగా రాజధాని తరలింపుపై గతంలోనే వార్తలు వచ్చాయనీ, నేడు కొడాలి వ్యఖ్యలతో అది నిరూపితం అవుతోందని అన్నారు రఘురామకృష్ణం రాజు. కోర్టులో కేసులను వెనక్కు తీసుకోకుంటే ఈ చిన్న రాజధాని కూడా తరలిస్తామంటూ బెదిరించే ధోరణలో కొడాలి నాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మంత్రి నాని పితృభాష ఎక్కువగా వాడుతున్నారని విమర్శించారు. కోర్టులో ఉన్న అంశంపై మంత్రి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హితవు పలికారు రఘురామకృష్ణంరాజు.
మంత్రి కొడాలి నాని ఏది మాట్లాడినా ఆయన భావవక్తీకరణలో ఉన్న మాధుర్యం చాలా మందికి నచ్చుతుందని అనుకుంటున్నాని యద్దేవా చేశారు. ఆఖరికి సిఎం జగన్ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు గానీ మాట్లాడితే వాటికి లక్ష వ్యూస్ వస్తే కొడాలి నానికి మాస్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఆయనకు మిలియన్ వ్యూస్ వస్తాయిని సెటైర్ వేశారు. నాని మాట్లాడే పితృభాష నచ్చేవారు ఎక్కువ మంది ఉంటారనీ, అందుకే ఆయన వాక్కు ఎక్కువ మందికి చేరుతోందనీ రఘురామ కృష్ణం రాజు విమర్శించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?