YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్సీపీకి చెంది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సీఎం జగన్ కనుసన్నల్లో జరిగిందని అంటున్నారు. ఇందులో నిజానిజాలు పక్కనపెడితే…ఈ నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
వాళ్లంతా ఫైరవుతున్నారు
కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎంపీని హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఈ అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.
వాళ్లకు ఎందుకు అంత శ్రద్ధ
బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టును ఖండించారు. ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే, ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మంత్రి చెరుకువాడ రంగనాథరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు 14 నెలలు నుండి ఢిల్లీలో కూర్చుని తనను గెలిపించిన ప్రజలను గాలికొదిలేశారని…కనీసం వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. ఈ సమయంలో ఎంపీని అరెస్టు చేయడం సరికాదంటున్న ప్రతిపక్ష పార్టీలు తీరు సరికాదని…అసలు వారికి ఏంటి అతని మీద అంత ప్రత్యేక శ్రద్ధ అని చురకలు అంటించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?