శ్రీకాకుళం,జనవరి 09: వైసిపి అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర బుధవారం ముగియనుంది. చివరిరోజు పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుండి ప్రతిపక్షనేత ప్రారంభించారు. తమ అభిమాన నేత పాదయాత్ర ముగింపు రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఆయన వెంట పాల్గొన్నారు.
2017 నవంబరు ఆరున వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుండి జగన్ చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత ఇచ్ఛాపురంలో ముగియనుంది. రాష్ర్టంలోని 134 నియోజకవర్గాలలో సుమారు 3,648 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టి, 124 బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సంకల్ప యాత్ర చేపట్టినందుకు ఛిహ్నంగా ఇఛ్చాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందు ఏర్పాటు చేసిన పాదయాత్ర విజయస్తూపాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభకు చేరుకుంటారు. సభ అనంతరం విజయనగరం చేరుకుని రైల్లో తిరుపతికి వెళతారు. గురువారం అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకుంటారు. వేంకటేశుని దర్శనం అనంతరం రాత్రి తిరుమలలో బసచేస్తారు. 11న తిరుమల నుంచి కడప చేరుకుని పెద దర్గాను దర్శిస్తారు. అక్కడనుంచి పులివెందులలో చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. అక్కడనుండి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ సమాధి వద్ద నివాళుల అర్పిస్తారు
previous post