14year boy, 16year old girl marriage : 14 ఏళ్ల బాలుడు , 16 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు.. మైనార్టీ తీరని ఈ పెళ్లిని సాధారణంగా చట్టం అంగీకరించదు. కానీ , ఈ మైనర్ల పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది.. బీహార్ లోని నలంద జిల్లాలో జరిగిన ఈ పెళ్లి విషయంలో కోర్టు మానవతా దృక్పధంతో ఆలోచించింది.. వారి పెళ్లి చెల్లుతుందంటూ తీర్పునివ్వటం గమనించాల్సిన విషయం..
సరస్వతి పూజకు హాజరైన బాలిక తన ప్రియుడి తో పాటు వెళ్లిపోయింది. 2019 ఫిబ్రవరి 11 న ఆ బాలిక తండ్రి అదే గ్రామానికి చెందిన ఒక బాలునిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనర్ జంట తమని ఎక్కడ విడదీస్తారోన్న భయంతో ఢిల్లీ కి పారిపోయి.. ఆ బాలిక అత్త ఇంట్లో ఉన్నారు.. అలా కొన్ని రోజులకు ఆ బాలిక గర్భవతి అయింది.. నెలలు నిండాక ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరవాత ఆమె పుట్టింటికి వచ్చింది.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు..
నలంద జిల్లా కోర్టు (బీహార్ షరీఫ్) కు గత శనివారం 2021 మార్చి 20 న ఒక విచిత్రమైన కేసు వచ్చించి.. 14 ఏళ్ల బాలుడు , 16 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. ఇంత చిన్న వయసు లోనే వీరికి ఒక బిడ్డ పుట్టడం. ఆ బిడ్డకు 8 నెలల వయసు ఉండటం మరో ట్విస్ట్.. ఈ విచిత్రమైన పెళ్లి విషయం పై కోర్టు మానవతా దృక్పధంతో వ్యవహరించింది.. జస్టిస్ మన్వెంద్ర మిశ్రా సంచలన తీర్పునిచ్చారు. కోర్టు తన తీర్పులో ఆ 8 నెలల చిన్నారిని అతని తాత, నాయనమ్మల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది.. అలాగే ఈ మైనర్ జంటను డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ లో ఉంచాలని.. అలాగే ప్రతి 6 నెలలకు ఈ జంట కు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. ఈ వింత కేసులో ఇటువంటి సంచలనాత్మక తీర్పునిచ్చిన కోర్టు.. ఈ తీర్పును ఆధారంగా చేసుకొని ఏ రాష్ట్రంలోని కోర్టు అయినా దీనిని అవలంబించకూడదని స్పష్టం చేసింది.. ముగ్గురు జీవితాలకు సంబంధించిన ఈ తీర్పు మానవతా దృక్పధంతో తీసుకున్నామని తెలిపింది..