కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేసింది. అలాంటి ఈ దారుణమైన వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వచ్చిన సమయంలో మాస్కు ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి. ఇలా చేస్తేనే కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారు.
అయితే కరోనా వైరస్ దేశంలోకి అడుగుపెట్టిన సమయం నుంచి ప్రతి గ్రామంలోను కరోనా పరీక్షల కేంద్రం నిర్వహించి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇక అలాగే ఇప్పటి వరకు ప్రతి గ్రామంలోను కరోనా లక్షణాలు ఉన్నవారికి, వారికి దగ్గర ఉన్నవారికి పరీక్షలు చేస్తూ వచ్చారు. అయితే హరియానాకు చెందిన రెండు గ్రామాలు కరోనా పరీక్షలు అవసరం లేదని బహిష్కరించారు.
అసలు కారణం ఏంటంటే.. హర్యానా రాష్ట్రలోని ఫతేహాబాద్ జిల్లా పరిధిలోని తమస్పురా, అలీపూర్ భరోత పంచాయతీలు ఈ నెల 6వ తేదీన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాయ్. ఇకపై ఆ గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించవద్దని, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది గ్రామంలోకి ప్రవేశిస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉందని వారు భయపడి ఈ తీర్మానం చేసినట్టు తెలిపారు.
అయితే ఒకవేళ ఎవరికైన కరోనా వైరస్ సోకినట్టు అయితే గ్రామస్థులు ఆందోళన చెందుతారని అతను తెలిపాడు. క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవని, కరోనా నియంత్రణకు ఔషదాలు కూడా లేవని గ్రామస్థులకు అపోహలు ఉన్నట్టు వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ విషయంపై ఫతేహాబాద్ డిప్యూటీ కమిషనర్ నరహరి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?