నిన్న రాత్రి తూర్పు లద్ధాఖ్ లో భారత్ మరియు చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలలో దాదాపు 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించింది.
గత కొద్ది రోజులుగా సరిహద్దు ప్రాంతంలో భారత్-చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశ ప్రభుత్వాలు వెంటనే చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనేక సార్లు చైనా సైనికులు సరిహద్దులు దాటి భారత ఆర్మీ పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా చైనా సైనికులు రెచ్చగొట్టే విధంగా దాడి చేశారని…. దీంతో తీవ్ర భౌతిక ఘర్షణలు తలెత్తి 20 మంది భారత జవాన్లు మృతి చెందారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వీరిలో తెలంగాణ, సూర్యాపేటకు చెందిన కల్నాల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు.