మారుతున్న కాలంతో పాటే ఖర్చులు పెరుగుతున్నాయి. గడిచిన నాలుగైదేళ్లలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు రావడంతో విద్య చాలా ఖరీదైపోయింది. ధనవంతులకు ఎటువంటి సమస్య లేదు కానీ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పిల్లలను చదివించుకోవడానికి పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో చాలామంది విద్యార్థులు స్కాలర్ షిప్ లపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు.
తాజాగా డిగ్రీ చదివే విద్యార్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు శుభవార్త చెప్పింది. డిగ్రీ చదివే విద్యార్థులకు 5000 రూపాయల స్కాలర్ షిప్ ఇవ్వడానికి ఐ.ఐ.ఎస్.సీ బెంగళూరు సిద్ధమైంది. iisc బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన-kvpy పేరుతో అందిస్తున్న ఫెలోషిప్స్ కు ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. http://kvpy.iisc.ernet.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐ.ఐ.ఎస్.సీ చెబుతోంది.
డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మొదట ఐ.ఐ.ఎ.సీ ఈ నెల 5వ తేదీని చివరి తేదీగా మొదట ప్రకటించగా ఆ తరువాత ఆ తేదీని అక్టోబర్ 19వ తేదీకి పొడిగించింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు 2021 జనవరి నెల 31వ తేదీన జరిగే యాప్టిట్యూడ్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇరు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
ఈ జిల్లాలలో తెలంగాణలోని మూడు జిల్లాలోని ఏపీలోని ఐదు జిల్లాలు ఉన్నాయి. ఐ.ఐ.ఎస్.సీ మాస్టర్స్ విద్యార్థులకు 7,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఫెలో షిప్స్ అందిస్తుంది. దరఖాస్తు చేయడానికి ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు ఫీజు 1,250 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 625 రూపాయలు.