7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త కరోనా కారణంగా గత మూడు విడతల డీఏ పెంపును వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. తాజాగా కేంద్రం ఏడవ వేతన సంఘం సిఫార్సులను అనుగుణంగా జూలై 1 నుంచి వాటిని అమలు చేయనుంది.. దీని వలన 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 ఒక లక్ష మంది పెన్షనర్లకు లాభం చేకూరుతుంది..
Read More: SBI: ఎస్బిఐ ఖాతాదారులకు 40 లక్షల వరకు ఇన్సూరెన్స్..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 17 శాతం డీఏ అమల్లో ఉంది అయితే కరోనా కారణంగా సంవత్సరం సంవత్సరన్నర కారణంగా వాయిదా పడుతూ వస్తున్న 3 విడుదల డీఏ 11 శాతం పెరగనుంది. 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 3 శాతం, 2021 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం పెరుగుదల జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో ప్రస్తుతం 17 శాతం కి 11 శాతం కలిపితే మొత్తం 28 శాతం డిఎ పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో భారీ మార్పు కనిపిస్తుంది. జూలై 1 నుంచి ఉద్యోగుల డిఏ తోపాటు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు సహకారం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్ పే లో 12 శాతం వారి ఈపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల జమ అవుతుంది.