ఈ మధ్య కాలంలో బంధాలకు, అనుబంధాలకు విలువ తగ్గిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల విషయంలో మానవత్వాన్ని మరిచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే తమ కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నారు. ప్రేమానురాగాలతో పెంచుకోవాల్సిన పిల్లలను ఇష్టానుసారం చితకబాదుతూ వాళ్లను బాధ పెడుతున్నారు. పసి హృదయాలలో చిన్న వయస్సులోనే తల్లిదండ్రులపై కోపం, ద్వేషం పెరిగేలా చేస్తున్నారు.
మహబూబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మేగ్యా తాండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి మరియు ఆమె తమ్ముడు బాలికపై అమానుషంగా దాడి చేశారు. సోషల్ మీడియాలో కన్న తల్లి బిడ్డ పై రోకలిబండతో చితకబాదుతున్న వీడియో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తల్లి బిడ్డ చదువుపై దృష్టి సారించకుండా టీవీ చూస్తుందని ఆమెపై కన్నప్రేమను మరిచి దాడికి పాల్పడింది.
కూతురి నిర్లక్ష్యం వల్ల ఇంటిలో సామాన్లు మాయం అవుతుండటంలో కాలుతో తొక్కుతూ దారుణంగా దాడి చేసింది. బాలిక తమ్ముడు కూడా అక్కపై పిడిగుద్దులతో దాడి చేసి ఆమెను మరింతగా బాధ పెట్టాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు తన మొబైల్ ఫోన్లతో ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే కూతురిపై దాడి చేయడం గురించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్ల లకు సమాజంలో రక్షణ లేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనతో ఇంట్లో కూడా బాలికలకు రక్షణ లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.