Thoughtfull Mother: చాలా సందర్భాలలో పిల్లలు కలిగిన తల్లులు.. వ్యవహరించే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. నెలలు కలిగిన బిడ్డ కొన్ని సందర్భాలలో పబ్లిక్ సమావేశాలలో అదేపనిగా ఏడుస్తుంటే.. కొంతమంది అక్కడే కూర్చుని తోటి వాళ్లకు చికాకు తెప్పించే రీతిలో వ్యవహరిస్తారు. మరికొంతమంది తల్లులు తోటివారికి అడ్డం లేకుండా .. ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకు వెళ్లిపోతారు. ఇప్పుడు ఇదే తరహాలో విమాన ప్రమాణంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియా దేశ రాజధాని సీయోల్ విమానాశ్రయం నుండి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో కి బయలుదేరే విమాన ప్రయాణ సమయం దాదాపు 10 గంటలు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో అదే విమానంలో నాలుగు నెలల బిడ్డ కలిగిన తల్లి.. విమానంలో రెండువందల మంది ప్రయాణికులకు ముందుగానే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పంపిణీ చేయడం జరిగింది. విమాన ప్రయాణం సమయంలో తన బిడ్డ ఏడుపు వల్ల.. ఎవరు అసహనానికి గురి కాకూడదని ముందుగానే క్షమాపణలు కోరుతూ పంపిణీ చేసిన బ్యాగ్ లో… మిఠాయి, చూయింగ్ గమ్, మరియు ఇయర్ప్లగ్లు పంపిణీ చేయడం జరిగింది. విమాన సమయంలో ఏ క్షణమైనా బిడ్డ.. ఏడ్చిన.. అరిచిన సందర్భంలో వాటిని ఉపయోగించాలని ముందస్తు క్షమాపణలు తెలియజేస్తూ పంచిపెట్టింది. అంతమాత్రమే కాదు ఆ బ్యాగ్ లో… నాలుగు నెలల బిడ్డ పేరున లెటర్ కూడా… తోటి ప్రయాణికులకి రాయటం జరిగింది.
ఆ లెటర్ లో…”హలో, నేను జాన్ వూ. నాకు 4 నెలలు మరియు ఈ రోజు నేను మా అమ్మ మరియు అమ్మమ్మతో కలిసి మా అత్త దుస్తుల కోసం అమెరికాకు వెళ్తున్నాను. నేను కొంచెం భయాందోళనగా మరియు భయపడ్డాను. ఇది నా మొదటిది నా జీవితంలో విమాన ప్రయాణం” జరిగింది. ఈ విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాలో రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. నిజంగా అందమైన తల్లి… అభం శుభం తెలియని తన పెద్ద ప్రయాణికుల మాట పడకుండా.. వారికి ఆటంకం కలగకుండా.. ఒక తల్లిగా అద్భుతంగా అందరి గురించి ఆలోచించండి అంటూ ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్ లు రియాక్ట్ అవుతున్నారు.