Aarogya Setu: కరోనా వైరస్ సంక్రమణను అదుపు చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు(Aarogya Setu) యాప్ ను విడుదల చేసింది.. కరోనా మొదటిదశలో విశేష సేవలందించింది ఈ యాప్.. వైరస్ పై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, చైతన్య పరుస్తూ వచ్చింది.. ఈ యాప్ ను ఇప్పటికీ 100 మిలియన్లకు పైగా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ అప్డేట్ చేస్తున్నారు.. తాజాగా ఈ యాప్ లో మరో అప్ డేట్ తీసుకు వచ్చారు.. మొదటి డోసు వేయించుకుంటేే ఒక బ్లూ మార్క్, రెండో డోసు వేయించుకుంటే రెండు బ్లూ మార్కులు కనిపిస్తాయని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది..!!
Read More: చిన్నారి ప్రాణాలను కాపాడిన విరుష్క జోడి
ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్ లో వైరస్ సమాచారం, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, మరో వ్యక్తి వ్యాక్సినేషన్ స్టేటస్ ను చూపిస్తోంది. తాజాగా ఈ యాప్ లో మరో అప్ డేట్ ను తీసుకొచ్చింది.. ఈ అప్ డేట్ లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి స్టేటస్ కనిపిస్తుంది. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఒక బ్లూ మార్క్, రెండు డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారికి రెండు బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. రెండు బ్లూ టిక్ మార్క్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆరోగ్య సేతు ట్విట్టర్ లో ప్రకటించింది. ఆరోగ్య సేతు యాప్ లో వ్యాక్సిన్ స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు. టీకాలు వేయించుకొని రెండు బ్లూ టిక్ మార్క్స్ పొందండి.. “వ్యాక్సిన్ వేయించుకోండి బ్లూ షీల్డ్ ని పొందండి”..అని ట్వీట్ చేసింది.. ఆరోగ్య సేతు యాప్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పరిశీలిస్తోంది. ప్రజల్ని సురక్షితంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు ఈ యాప్ లో తగిన సమాచారం అందుబాటులో ఉంచుతుంది.
Now your Vaccination Status can be updated on Aarogya Setu. Get your self vaccinated – Get the Double Blue Ticks and Get the Blue Shield.#SetuMeraBodyguard #IndiaFightsCorona @NICMeity @GoI_MeitY @_DigitalIndia @mygovindia @MoHFW_INDIA @NITIAayog pic.twitter.com/qhJh7t1ukK
— Aarogya Setu (@SetuAarogya) May 25, 2021