Acidity: మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. పోషకాలున్న ఆహారం తీసుకోవటం చాలా అవసరం.. ఈ రోజుల్లో చాలామంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు.. ఇది తగ్గించడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు.. అయితే మనం అందుకోసం ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.. కొన్ని కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ చెక్ పెట్టవచ్చు.. అవి ఏంటో చూద్దాం..
Acidity: అలవాట్లను మార్చుకోండి..!!
ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వెంటనే వారికి ఈ సమస్య వస్తుంది అందుకని అటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు మాంసాహారం ఎక్కువగా తినకూడదు. సాధారణంగా కూడా మాంసాహారాన్ని వారం లో రెండు లేదా మూడు రోజులకు మించి తీసుకోకూడదు. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు.
తిన్న వెంటనే నిద్రపోకూడదు. కనీసం ఐదు నిమిషాలైనా నడవాలి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత వరకు నిద్ర పోకూడదు. ఎసిడిటీ తో బాధపడుతున్న వారు పుల్లటి ఆహార పదార్థాలు ఏవి తీసుకోకూడదు. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తినవద్దు. వేయించిన పదార్థాలు, ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, వేపుడ్లు, నూనె లో వేయించిన ఆహార పదార్థాలు తినకూడదు. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు సిట్రస్ పండ్లు, పుల్లని ఆహార పదార్థాలు తీసుకోకూడదు.
Acidity: వీటితో ఎసిడిటికి సమస్యకు చెక్ పెట్టండి..!!
ఎసిడిటీ సమస్యతో బాధ పడుతున్న వారు బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే ఒక అరటి పండును తినాలి. అరటి పండు తిన్న తర్వాతే మిగతా ఏ ఆహార పదార్థాలు అయినా తీసుకోవాలి. ఇలా ఆహారానికి ముందు అరటి పండ్లు తినడం వల్ల ఎసిడిటికి సమస్యకు చెక్ పెట్టవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో సబ్జా గింజలు కొన్ని తులసి ఆకులు వేసి నానబెట్టాలి. పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల అజీర్తికి తగ్గుతుంది. ఈ నీటిని దగ్గు, జలుబు, రుతుక్రమం వచ్చిన వారు తాగకూడదు.
కొబ్బరి నీళ్ళు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఎసిడిటి ఉన్న వారు కొబ్బరి నీళ్ళు ఉదయం భోజనానికి ముందు తాగాలి. ఈ నీటిని ఎక్కువగా తగుతుండటం వలన ఎసిడిటి సమస్య త్వరగా తగ్గుతుంది. పైన చెప్పుకున్న అలవాట్లు మార్చుకుని ఈ చిట్కాలు పాటిస్తే ఎసిడిటి సమస్య నుంచి బయటపడవచ్చు.