Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలాంటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. పైగా మహేష్ మేక్ఓవర్ సరి కొత్తగా ఉండటంతో పాటు కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటిస్తుండటంతో సినిమా స్టోరీ ఏంటి అనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ దుబాయ్ లో దాదాపు రెండు నెలలపాటు జరిగింది. ఆ తర్వాత ఇండియాలో షెడ్యూల్ స్టార్ట్ చేయగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికం కావడంతో జరుగుతున్న షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం దుబాయ్ లో కంప్లీట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక పెద్ద బిజినెస్ మాన్ తరహాలో విలన్ పాత్ర ఉంటుందని దానికోసం సౌత్ ఇండియా యాక్షన్ కింగ్ స్టార్ హీరో అర్జున్ ని తీసుకోవటానికి పరశురాం రెడీ అయినట్లు సమాచారం.
Read More: Mahesh Babu: కోవిడ్ వచ్చిన సమయంలో మహేష్ బాబు చేసిన బిగ్ హెల్ప్ ఇటీవల బయటపెట్టిన అనిల్ రావిపూడి..!!
మహేష్ బాబు కి దీటుగా ఉంటుందని … క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటంతో పరుశురాం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఈ నెల 31 వ తారీకు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉండదని సోషల్ మీడియాలో సరి కొత్త టాక్ వినపడుతోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు మరణాలు సంభవిస్తే ఉండటంతో ఇది సరైన సమయం కాదని సినిమా యూనిట్ ఎటువంటి ఫోటో కానీ వీడియో కానీ రిలీజ్ చేయకూడదని అనుకుంటున్నట్లు టాక్.