Sai dharam tej:సినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన స్పోర్ట్స్ బైక్పై హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి పై వెళుతుండగా స్కిడ్ అయి పడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటనే దగ్గర్లో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్కు యాక్సిడెంట్కు గురై అపస్మారక స్థితిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆయనకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని మాదాపూర్ పోలీస్ అధికారులు సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ అపస్మరక స్థితి నుండి బయట పడినట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే మెగా బ్రదర్స్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మెడికవర్ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయి ధరమ్ తేజ్ ను తరలించారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. అభిమానులు ఆందోళన చెంద వద్దని, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చిరు ట్వీట్ చేసారు. అభిమానులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.