ప్రముఖ నటి కంగన రానౌత్ కుషీ అయ్యారు. ఎందుకంటే .. దాదాపు 20 నెలల క్రితం నిలిపి వేయబడిన ఆమె ట్విట్టర్ ఖాతా ఇవేళ పునరుద్దరించబడింది. బెంగాల్ ఎన్నికల పరిణామాలపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేసిన నేపథ్యంలో సంస్థ నిబంధనలను కంగనా ఉల్లంఘించారన్న అభియోగంపై 2021 మే నెలలో ట్విట్టర్ ఆమె ఖాతాను నిలిపివేసింది. తాజాగా ఆ అకౌంట్ ను ట్విట్టర్ పునరుద్దరించింది. అయితే బ్లూటిక్ ను ఇంకా జారీ చేయలేదు.
ట్విట్టర్ ఖాతా పునరుద్దరణపై రానౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ‘మళ్లీ ఇక్కడ (ట్విట్టర్) కు రావడం సంతోషంగా ఉంది’ అంటూ పోస్ట్ పెట్టిన కంగన.. రెండో ట్వీట్ లో తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ వివరాలు పోస్టు చేశారు. ఎమర్జెన్సీ సినిమా చిత్రీకరణ విజయవంతంగా పూర్తి అయ్యిందనీ, ఈ ఏడాది అక్టోబర్ 20న థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపారు. షూటింగ్ కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు కంగన.
కంగన రానౌత్ ట్విట్టర్ హాండిల్ పునరుద్దరణ కావడంతో ఆమె అభిమానులు, ట్విట్టర్ యూజర్లు కామెంట్స్ రూపంలో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. కంగన రానౌత్ కు ట్విట్టర్ లో 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ ఖాతా పునరుద్దరణ అయిన వెంటనే ఆమె చేసిన ట్వీట్ ను గంటల వ్యవధిలో 2.3 మిలియన్ మంది చూడగా, వేలాది మంది లైక్స్ చేస్తూ రీట్వీట్ చేస్తున్నారు.
ఇక కంగన రానౌత్ కొత్త సినిమా విషయానికి వస్తే.. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆదారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమానే ఎమర్జెన్సీ. ఈ మువీకి నిర్మాత, దర్శకురాలిగానూ కంగన వ్యవహరించారు.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
And it’s a wrap !!!
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023