Flash News: సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ దక్కించుకుంది కవిత. 11 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన కవిత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల సినిమాల్లో అనేక భాషల్లో నటించింది. అంత మాత్రమే కాక తెలుగుదేశం పార్టీలో కూడా రాణించింది. అటువంటి కవిత ఇంటిలో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి. విషయంలోకి వెళితే ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనా తో పోరాడి కన్నుమూశారు.
కుర్ర వయసులో చనిపోవడంతో కవిత కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలియడంతో చాలామంది సెలబ్రిటీలు కవిత కుమారుడు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది సెలబ్రిటీలు మరియు సామాన్యులు మరణించిన సంగతి తెలిసిందే. ఎవరిని కూడా కనికరించడం లేదు ఈ మహమ్మారి. అటువంటి మహమ్మారి కరోనా బారిన పడి కవిత కుమారుడు సంజయ్ రూప్.. అదే రీతిలో ఆమె భర్త దశరథ రాజు. ఈ క్రమంలో కుమారుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఇక కవిత భర్త దశరథ రాజు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా చేతికి అంది వచ్చిన కవిత కుమారుడు మరణించడంతో ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?