ప్రస్తుతం బాలీవుడ్ నే కాదు.. యావత్ భారతదేశ సినీ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న వార్త ఆదిపురుష్. అవును.. ఆదిపురుష్ సినిమా మీదనే ప్రస్తుతం చర్చ. అదే ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రభాస్ డైరెక్ట్ గా తొలిసారి బాలీవుడ్ మూవీలో నటిస్తుండటంతో ఈ చర్చ మరికాస్త పెద్దదైంది. అందులోనూ రామయణ ఇతిహాసం మీద సినిమా అనేసరికి ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయి. రాముడిగా ప్రభాస్ నటిస్తుండటం.. 3డీ ఫార్మాట్ లో సినిమా వస్తుండటం.. అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వెయ్యి కోట్ల బడ్జెట్ తో సినిమాను తీస్తుండటంతో సినిమాపై ఆశలు భారీగానే ఉన్నాయి.
అయితే.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ను ఆ సినిమా డైరెక్టర్ ఓం రావత్ సినీ అభిమానులతో పంచుకున్నారు.
నేను ఈ సినిమా కథను ప్రభాస్ ను ఊహించుకొని రాశాను. ప్రభాస్ అయితేనే సెట్ అవుతాడు అని అనుకొని ఆయనకు అనుగుణంగా ఈ కథను రాశాను. ఒకవేళ ఈకథ విన్న తర్వాత కథ నచ్చకపోయినా.. ఇతర కారణాలు ఏవైనా ఉండి.. ఈ సినిమాను నేను చేయను.. అని ప్రభాస్ చెప్పి ఉంటే వెంటనే ఈ సినిమాను ఆపేసేవాడిని. ఒక్క సెకన్ కూడా ఆలోచించేవాడిని కాదు. సినిమా స్టోరీని తీసుకెళ్లి చెత్తబుట్టలో వేసేవాడిని. ఎందుకంటే.. ఈ సినిమా తీస్తే ప్రభాస్ తోనే. లేకపోతే లేదు అనుకొని స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించా..అంటూ ఓం రావత్ చెప్పుకొచ్చారు.
ప్రభాస్ చాలా ప్రశాంతమైన మనిషి. ఆయన నిలబడే తీరు, స్టయిల్, ప్రవర్తన అన్నీ నాకు బాగా నచ్చుతాయి.. అందుకే నా సినిమాకు ఆయననే హీరోగా ఎంచుకున్నా. నిజానికి ఈ సినిమా తానాజీ కంటే ముందే రావాల్సి ఉంది. కానీ.. అప్పటికి ఇంకాస్త స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ లో ఉండటం, కథ కోసం ఇంకాస్త పరిశోధన చేయడం లాంటివి పెండింగ్ లో ఉండటంతో ముందు తానాజీ సినిమా తీశా. ఆ సినిమా అయిపోయాక.. దాదాపు రెండు నెలలు శ్రమించి… ఆది పురుష్ కథను ఓ కొలిక్కి తీసుకొచ్చాం.. అంటూ ఓం రావత్.. చెప్పుకొచ్చారు.