Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్.. రామాయణ మహాకావ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమాలో మేఘనాథ్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్ల నటించనున్నారు..
ఓం రౌత్ ఈ సినిమాలో మేఘనాథ్ పాత్రను శుక్లాకు అతని పాత్రను వివరించానని, అతని పాత్ర అత్యంత శక్తివంతమైనది, దూకుడుగా ఉంటుందని కూడా తెలియజేశారు.. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. ఇక లంకేశ్వర రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 30సంవత్సరాల పూర్వం జరిగిన కథతో రామాయణానికి ఉన్న సంబంధాన్ని తెలియజేయనున్నారు.
TFI Flash Updates ??#Adipurush – Meghnadh Role
◾ BOLLYWOOD ? #SiddharthShukla is part of #Prabhas #KritiSanon starrer #Adipurush
◾ #OmRaut narrated a story ,his role will be powerful and aggressive #PRABHAS25 #RadheShyam #Salaar pic.twitter.com/JJWz54Dta1
— trendy tolly (@urstanay) May 14, 2021
ఈ సినిమా కోసం ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ బాడీ ట్రాన్స్ఫార్మర్ కోసం శ్రమిస్తున్నారు.. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. భారత దేశంలో ఇప్పటి వరకు చూడనటువంటి భారీ విజువల్ మైదా లాజికల్ వండర్ ను చూపించాలని ఫిక్స్ అయిపోయాడు ఓం రౌత్.. ఈ సినిమా కి క్యాపిటల్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుకుంటూ సినిమాని పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. ఇప్పటివరకు ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సూరత్, రాజేష్ నాయక్, ఓం రౌత్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?