Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్.. ఈ చిత్రాన్ని టి సిరీస్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్ లో జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఈ ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది..
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇకపై హైదరాబాద్ లోనే జరగబోతుందట. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. కరోనా ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు.. దీంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. దీంతో పలు సినిమా షూటింగ్స్ ఆగిపోవాల్సి వచ్చింది. ఇక ఈ సమయంలోనే ఆదిపురుష్ తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేయాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు గా టాక్ వినిపిస్తోంది.. ఇక అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వారం లోనే హైదరాబాద్ లో ఆదిపురుషో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందట. ఈ షెడ్యూల్ లో పాల్గొనడానికి ప్రభాస్, ఆలియా భట్, సైఫ్ అలీఖాన్ అంగీకరించారట.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నారు.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. అలాగే పవర్ ఫుల్ రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలు కన్నడ హీరో సుదీప్ ఓ పాజిటివ్ నటిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. సుదీప్ విభీషణుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే పక్కగా జాగ్రత్తగా తీసుకుంటే ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా షూటింగ్ చేయడం సమస్య కాదని భావిస్తోంది యూనిట్. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.