Afghanistan Taliban Crises: ఆఫ్ఘన్ దేశం తాలిబన్ల వశమైంది. ఆ దేశ ప్రజాస్వామ్య పాలన ఇప్పుడు తాలిబన్ల చేతికి వెళ్ళిపోయింది. దేశ ప్రజలకు శాంతి కరువయింది. పాలన కుప్పకూలింది.. ఇది మొత్తం అందరికీ తెలిసిన వ్యవహారమే. అయితే తాలిబన్ల పాలన కారణంగా ఇతర దేశాలపై ఏ విధమైన ప్రభావం ఉండనుంది..? ముఖ్యంగా మన దేశంపై ఎటువంటి ప్రభావం పడనుంది అనే విషయాలు కీలకమయ్యాయి. ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన వలన మన దేశానికి పాలన, రక్షణ, భద్రత పరంగా ఎటువంటి ముప్పు లేనప్పటికీ ఆర్ధిక ముప్పు పొంచి ఉంది. వ్యాపార పరమైన ముప్పు ఉంది. ఆఫ్ఘన్ లో దాదాపు రూ. 3 మిలిలన్ డాలర్ల పెట్టుబడి పెట్టిన భారత్ ఈ మేరకు ఆర్ధిక లావాదేవీలను, దిగుమతులను కోల్పోనుంది. అంతే కాదు.., మనకు రావాల్సిన అనేక వస్తువులు ఆగిపోయి.., వాటి ధరలు మన దగ్గర చుక్కలను చేరనున్నాయి..!
Afghanistan Taliban Crises: డ్రై ఫ్రూట్స్ భారీగా పెరుగుతాయి..!
మీరు ప్రతీ ఊరిలో చూసే ఉంటారు.. ఎండు ఖర్జురామ్, ఎండు కిస్ మిస్ రోడ్డు పక్కన బండిపై పెట్టి అమ్ముతుంటారు. కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. ఇవి ఆఫ్ఘన్ నుండి వచ్చివే. ఆఫ్ఘన్ లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. మన దేశంలో లభ్యమయ్యే డ్రై ఫ్రూట్స్ వాటాలో దాదాపు 75 శాతం ఆఫ్ఘన్ నుండి దిగుమతి చేసుకున్నవె.. గడిచిన వారం రోజుల నుండి ఈ లావాదేవీలు నిలిచిపోయాయి. డ్రై ఫ్రూట్స్ క్రమంగా ధరలు పెరగడం మొదలయ్యాయి. దిగుమతి పునః ప్రారంభం కాకపోతే మరో 15 రోజుల్లో దేశం మొత్తం మీద డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరగనున్నాయి.
* భారత్ నుండి ఆఫ్ఘన్ కి కూడా మందులు, టీ , కాఫీ పొడి, చెర్రీ, పుచ్చకాయ, కొన్ని రకాల కూరగాయలు, ఆరోగ్య మూలికలు ఎగుమతి అవుతాయి. ఏటా రూ. 800 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు అక్కడకే వెళ్తాయి. * ఆఫ్ఘన్ నుండి భారత్ కి ఏటా 38 నుండి 40 వేల టన్నుల డ్రై ఫ్రూట్స్ వస్తాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య లావాదేవీలు నిలిచిపోయాయి. రానున్న పది రోజుల్లో లావాదేవీలు పునః ప్రారంభమవుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎందుకు నిలిచిపోయాయంటే..!?
ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య యుద్ధం లేదు, గొడవ లేదు, తాలిబన్లతో ఇండియాకు శత్రుత్వం లేదు.. కానీ ఎందుకు ఈ వ్యాపార లావాదేవీలు,ఎగుమతులు నిలిచిపోయాయి అనే అనుమానం రావచ్చు.. ఆఫ్ఘన్ నుండి ఇండియాకు ఏం రావాలన్నా కొన్ని రోడ్డు మార్గం ద్వారా, కొన్ని కార్గో విమానాల ద్వారా వయా పాకిస్థాన్ వస్తాయి. ఆఫ్ఘన్ కి పాకిస్తాన్ కి మధ్య ప్రస్తుతం కార్గో సేవలు నిలిచిపోయాయి. ఆఫ్ఘన్ నుండి పాక్ మీదుగా వెళ్లే రాకపోకలు మొత్తం నిలిపేశారు. ఈ కారణంగా ఈ మార్గంలోని దేశమైన ఇండియాకు కూడా ఈ లావాదేవీలు జరగడం లేదు. ఆఫ్ఘన్ – పాక్ మధ్య కార్గో సేవలు ప్రారంభమయితేనే మళ్ళీ భారత్ – ఆఫ్ఘన్ మధ్య ఎగుమతి, దిగుమతులు ఆరంభమవుతాయి. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమి లేనప్పటికీ రానున్న 10, 15 రోజుల్లో ఈ సమస్య తీవ్రతరం కానుంది..!