Afghanisthan: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కుల్చేయడం తెలిసిందే. ఎప్పుడైతే అమెరికా నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు రావడం జరిగాయో… తాలిబాన్ లు రెచ్చిపోయారు. ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసి.. ప్రభుత్వాన్ని దింపేసి తమ సామ్రాజ్యాన్ని మళ్లీ స్థాపించారు. అంతకుముందు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ నీ ఏలిన… క్రమంలో వాళ్లు తీసుకు వచ్చిన చట్టాలు వలన చాలామంది ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. దీంతో తాలిబాన్ లు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయటంతో ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి పారిపోయారు.
ఏకంగా విమానాల రెక్కలపై వేలాడుతూ… ఎలాగైనా ఈ నరరూప రాక్షసుల నుండి తప్పించుకోవాలని.. సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మా భరిస్తాం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్ లు ప్రారంభంలో కొద్దిగా సామరస్యం గా వ్యవహరించిన గాని ఇప్పుడు మరింత కఠినంగా గతంలో మాదిరిగా చట్టాలు అమలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తాలిబాన్ లు.. ప్రారంభంలో ఆడపిల్లలు చదువుకోవచ్చని కళాశాల విద్య కూడా చదువుకోవచ్చు అభ్యంతరం లేదని ప్రకటన చేశారు.
కానీ ఇటీవల బాలికలు హైస్కూల్ విద్య అభ్యసించకూడదు, ఆరో తరగతి వరకు మాత్రమే చదవాలని గతంలో మాదిరిగానే మళ్ళీ ప్రకటన చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భవనాల లో పనిచేసే ఉద్యోగస్తులు ఖచ్చితంగా గడ్డం పెంచుకునే రావాలి లేకపోతే ఉద్యోగం తీసేస్తామని సరికొత్త రూల్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఏ ప్రభుత్వ అధికారికి అయితే గెడ్డం ఉండదో… వాళ్లు ఉద్యోగాలు వదిలి చేసుకోవచ్చని సరికొత్త ఆదేశాలు తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ లో తాజాగా ప్రవేశపెట్టడం.. సంచలనంగా మారింది.