Afghanisthan Pakisthan: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. దాదాపు ఇరవై సంవత్సరాలు ఉనికిలో లేని తాలిబాన్ లు… ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించాయో… ఒక్కసారిగా తాలిబాన్ లు.. ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయడం స్టార్ట్ చేశారు. కొద్ది నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేసి.. తాలిబాన్ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగానే ఆఫ్ఘనిస్తాన్ లో కఠినమైన నిబంధనలు శిక్షలు అమలు చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో ఆడవాళ్లను విద్యకి ఆల్రెడీ దూరం చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఆర్థికంగా ఇంకా అనేక రకాలుగా ఆఫ్ఘనిస్తాన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ గత కొద్దీ దినాల నుండి ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నే ఉంది. ఈ దాడిలో 36 మంది తాలిబాన్ పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు మరణించడంతో.. తాలిబాన్ నాయకులు పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ పై దండ యాత్ర చేయాలని చూస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాలిబాన్ ల వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు, ఆప్ఘనిస్థాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ, యావత్ ప్రపంచంతో పాటు పొరుగుదేశం నుంచి కూడా తాము సమస్యలను ఎదుర్కొంటున్నామని పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రాధాన్యతలనీ దృష్టిలో పెట్టుకుని దాడులను క్షమిస్తున్నం మరోసారి రిపీట్ అయితే.. ఊరుకునే ప్రసక్తి లేదని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు ప్రభుత్వం స్థాపించిన నాటి నుండి పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఎన్నో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ గగనతలం నుండి ఆఫ్ఘనిస్తాన్ పై బాంబుల వర్షం కురవటం సంచలనంగా మారింది.