తల్లి నవమాసాలు మోసి తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని సందర్భాలలో నెలలు నిండక ముందే తల్లి బిడ్డకు జన్మనిచ్చింది అని వింటూ ఉంటాం. దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే… తొమ్మిది నెలలో ప్రాణం పోసుకోవాల్సిన ఒక బిడ్డ 27 సంవత్సరాల తరువాత జన్మించింది. అవును మీరు విన్నది నిజమే….. ఇది ఎలా అనుకుంటున్నారా….. అమెరికాలోని టేనస్సీకి చెందిన టీనా బెన్ గిబ్సన్ దంపతులు దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డుకెక్కారు. పిండం ఏంటి…. 27 ఏళ్ళు ఏంటి…గడ్డకట్టడం ఏంటి….. అర్ధం కాలేదా…..
అది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా, అవును నిజమే ఈ బిడ్డ పుట్టడానికి 27 సంవత్సరాలు పట్టింది. అమెరికాలో ‘ఎంబ్రోయో డొనేషన్’ అనే విధానం అమల్లో ఉంది. దీనిలో ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా ఎంబ్రోయే డొనేషన్ చేయవచ్చు. అంటే తాము పిల్లలను కనకుండా గర్భస్థ పిండాలను దానం చెయ్యవచ్చు. ఇలా దానం చేసిన పిండాలను గడ్డగట్టిన స్థితిలో నిలువ ఉంచుతుంది అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ (ఎన్ఈడీసీ) అనే సామాజిక సంస్థ. ఆ తరువాత ఆలా స్టోర్ చేసిన గర్భస్తపిండాలను ‘ఎంబ్రోయో డొనేషన్ ప్రకారం తల్లిదండ్రులు దత్తత తీసుకోవచ్చు. తమ వద్ద గడ్డకట్టిన స్థితిలో ఉన్న గర్భస్థ పిండాలను వైద్యులు సదరు తల్లిదండ్రులకు అందిస్తారు. వారు ఈ పిల్లలను పెంచుకుంటారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంది. ఈ పిండాన్ని టీనా బెన్ గిబ్సన్ దంపతులు దత్తత తీసుకోగా ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది. ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డుకెక్కారు.