Big Boss : నాలుగో సీజన్ బిగ్ బాస్ రియాల్టీ షో బాగా పాపులర్ అవ్వడానికి గల కారణాలలో ఒకటి అఖిల్, మోనాల్ జంట అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ చాలా రొమాంటిక్ తరహా వాతావరణాన్ని క్రియేట్ చేసి..ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టు కున్నారు. హౌస్ లో వీళ్ళిద్దరూ ఉన్నంతసేపు.. టిఆర్పి రేటింగులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని సోషల్ మీడియాలో ట్రోల్స్ అదే రీతిలో బిగ్ బాస్ అడ్వర్టైజ్ మెంట్స్ జరిగే ఎపిసోడ్స్ పై ఎంతగానో ఆసక్తిని పెంచేవి. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో.. అది కూడా సినిమా థియేటర్లు లేని టైంలో.. షో రావటంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు పొందటం జరిగింది.
అందరిలో కంటే వీరిద్దరికి మాత్రం స్పెషల్ గుర్తింపు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాలలో వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సీజన్ ఫోర్ అయిపోయాక వీరిద్దరూ అనేక టెలివిజన్ షో లలో ప్రత్యేకమైన అతిథులుగా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించటానికి వీరిద్దరు సరికొత్త ఐడియాతో ఒక ప్రయోగం చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త వినబడుతుంది. మేటర్ లోకి అంటే ఇద్దరు కలిసి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా తెలియజేసినట్లు.. ఈ వెబ్ సిరీస్ కి తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే పేరును అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు రాబోతున్నట్లు సరస్వతి క్రియేషన్స్ అనే సంస్థ నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.