సెలబ్రిటీల అలవాట్లు వేరుగా ఉంటాయి. వీరు పాపులర్ అయ్యాక ఇలా మారుతారా లేదా ఎప్పటినుండో ఈ అలవాట్లు ఉన్నాయో తెలియదు కానీ…. వారిని చూసి ఎంతో మంది ఫాలో అవుతుంటారు. బ్రాండ్స్ వారు కూడా అందుకే వారి వెంట పడతారు. అందరి సెలబ్రిటీలకు ఒక అలవాటు ఉండటం అనేది చాలా అరుదైన విషయం…. ప్రస్తుతం ఈ అరుదైన విషయం ట్రెండింగ్లో నిలిచింది.
విషయం ఏమిటంటే…. దాదాపు ఎనిమిది నెలలు కరోనా మహమ్మారి సెలబ్రిటీలను తమ ఇళ్లలో బంధీలను చేసింది. వారు ఎటూ వెళ్లలేకపోయారు. అలా బయటకెళ్ళి రిలాక్స్ అవుదామని బయట లాక్ డౌన్. నువ్వు సామాన్యుడైన…. సెలబ్రిటీలు అయినా ఒకటే రూల్స్. అందరితో సమానంగా ఎన్నో నెలలు బ్రతికిన వారు ఒక్కసారిగా అన్ లాక్ ప్రక్రియ పూర్తిస్థాయిలో మొదలు కాగానే బయటకు గెంతారు. ఏదో కట్ట తెగి వచ్చిన వరద లాగా అందరూ పొలోమని విహారానికి ప్రయాణమయ్యారు. అంతా కలసి ప్రపంచంలో మరొక చోట లేనట్లు మాల్దీవ్స్ కి వెళ్లడం ఏమిటని సామాన్యులు సందేహపడుతున్నారు.
ఇలా మాల్స్దీవ్స్ కి వెళ్ళిన వారి లిస్ట్ లోకి వస్తే సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, దిశాపటాని, తారా సుతారియా, నేహా దూపియా, తాప్సీ పన్ను, మౌని రాయ్. మందిరాబేడీ వంటి వారు ఉన్నారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ తదితరులు కూడా అక్కడి విహారంలో చిల్ అవుట్ అవుతున్నారు.
టైగర్ తో పాటు అతని సోదరుడు కృష్ణ ష్రాఫ్ కూడా మాల్దీవ్స్ లోనే ఉన్నాడు. సహజ సుందరమైన బీచ్ లు, విలాసవంతమైన రిసార్ట్స్, మాల్దీవుల్లో చిరస్మరణీయమైన బస కోసం రెడీగా ఉన్నాయి. ఇక భారత దేశంలో చాలామందికి ఇది భూతల స్వర్గం అని అంటుంటారు. తరచుగా హనీమూన్ గా ఇదే ఎంతో మంది దంపతులు తమ గమ్యస్థానంగా ఎంచుకుంటారు. కొందరు స్నేహితులతో వెళ్తే మరి కొందరు కుటుంబ సభ్యులతో వెళ్తారు. సెలబ్రిటీలను, మిగతా పర్యాటకులను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్యాకేజీలను కూడా అక్కది వారు ప్రవేశపెట్టడం గమనార్హం. వారికి రాయితీలు అందించడం మరొక ఎత్తు. అలా పిలుస్తుంటే ఇక వెళ్ళక అగుతారా చెప్పండి..!