Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిగత విషయాలు అదే విధంగా సోషల్ మీడియా టేకప్ చేసేవారిని చాలా ప్రత్యేకంగా చూసుకుంటారని ఇండస్ట్రీలో ఎప్పటినుండో టాక్. వారిలో ఎవరి బర్త్డే వచ్చిన అల్లు అర్జున్ హాజరయ్యే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మాత్రమేకాక దగ్గరుండి సెలబ్రేట్ చేస్తుంటారని చెబుతారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో తన టీం సభ్యుల పట్ల బన్నీ మరోసారి ప్రేమను చాటుకున్నాడు.
మేటర్ లోకి వెళ్తే అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అంతకుముందు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారు. అయితే ఈ క్రమంలో మరోసారి తన చుట్టుప్రక్కల ఇటువంటి పరిస్థితి రాకూడదని .. తనవల్ల మరొకరికి, ఇతరుల వల్ల తనకు ఎటువంటి హాని కలగకుండా అల్లు అర్జున్ తన టీం సభ్యులందరికీ వ్యాక్సిన్ వేయించడం జరిగిందట. కేవలం టీం సభ్యులకు మాత్రమే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా అల్లు అర్జున్ దగ్గరుండి వ్యాక్సిన్ వేయించినట్లు సమాచారం.
ఈ న్యూస్ సోషల్ మీడియాలో రావడంతో అల్లు అర్జున్ అభిమానులు .. మనసున్న బన్నీ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా తరహాలో మొట్టమొదటిసారి బన్నీ సినిమా వస్తూ ఉండటంతో.. సినిమా ప్రేమికులు “పుష్ప” పై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.