Allu Arjun : అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నాడు.. తాజా అల్లు అర్జున్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.. ఈ పోస్ట్ పై నెటిజన్లు లైక్స్, షేర్, కామెంట్ వర్షం కురిపిస్తున్నా రు..
అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా 28 మార్చి 2003 లో విడుదలైంది.. నేటికీ ఈ సినిమా విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా బన్నీ తన ట్విట్టర్లో .. 18 సంవత్సరాల జర్నీకి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు..
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోందిి.
It’s has been 18years since my first film released. I wanted to thank each n everyone who has been a part of my 18years journey. My heart is filled with gratitude. I am truly blessed for all the love showered over the years . Thank you for all the blessings. Gratitude. AA
— Allu Arjun (@alluarjun) March 28, 2021