Allu Arjun: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇండియాలో అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి ఎవరిని విడిచి పెట్టడం లేదు. ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడి మృతి చెందిన వాళ్ళు కూడా ఉండటం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా కరోనా బారిన పడటం జరిగింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో డాక్టర్ల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు.. ఆరోగ్యం అంతా బాగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ తరుణంలో తనని ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారినందరిని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా అభిమానులు మరియు సన్నిహితులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని అంతా బాగానే ఉన్నట్లు బన్నీ స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ తండ్రి అల్లు అరవింద్ కి కూడా కరోనా పాజిటివ్ రావటం తెలిసిందే. దీంతో ముందు తండ్రికి ఆ తర్వాత కొడుకు కి సంతు అల్లు వారి కుటుంబంలో టెన్షన్ నెలకొంది.