Hockey World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ టోర్నీలో మొదటి మ్యాచ్ స్పెయిన్ జట్టుతో గెలవడం తెలిసిందే. కానీ సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరగగా డ్రాగా నిలిచింది. “పూల్ డీ” టాపర్ గా నిలవాలని భారత్ మరియు ఇంగ్లాండ్ టీమ్స్ ఆదివారం హోరాహోరీగా తలపడ్డాయి. కానీ చివర ఆఖరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ మరియు భారత్ ప్లేయర్స్ ఏమాత్రం రాణించలేకపోయారు. కానీ మ్యాచ్ స్టార్టింగ్ టైములో ఇండియన్ హాకీ ప్లేయర్ హార్దిక్ సింగ్ గోల్ పోస్ట్ దాకా దాదాపు వెళ్ళినా గాని అతని ప్రయత్నాలు ఎక్కడా కూడా సఫలం కాలేదు.
ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఒలీవర్ పైన్ అద్భుతంగా డిఫెన్స్ చేయటంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవటం జరిగింది. హార్దిక్ సింగ్ ఒకానొక దశలో..గోల్ వేసేదాకా వెళ్ళినా గాని అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారత ఆటగాళ్లు ఎక్కడ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ వరల్డ్ కప్టోర్నీలో మొదట మ్యాచ్ స్పెయిన్ తో గెలిచి మంచి సువారంభం చేసిన గాని సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆ జోరు కొనసాగించలేకపోయారు.
స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ గెలవటంతో భారత్ మూడు పాయింట్లు సాధించడం జరిగింది. ఇంగ్లాండ్ తో రెండో మ్యాచ్ కూడా నెగ్గి గ్రూప్…లో టాప్ లో నిలవాలి అనుకున్న కానీ కుదరలేదు. మరోపక్క ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్ వేల్స్ తో భారీ స్కోర్ తో విజయం సాధించింది. దీంతో ఈ రెండు చెట్లు రెండో మ్యాచ్ గెలిచి గ్రూపులో టాప్లో నిలవాలని అనుకున్నా గాని డ్రా అయిపోయింది. ఈ పరిణామంతో రెండు చెట్లకు చెరువు పాయింట్లు లభించింది. కానీ గోల్స్ బట్టి ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది.