కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు , భయంకరమైన ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. ఒక్కొక్కసారి ఈ మూఢనమ్మకాలు వలన మనుషులు తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.ఈ ఘోర సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ లో జరిగింది. అమావాస్య అని ఆగిపోవడమే భార్య భర్తల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. అసలేం జరిగిందో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
శ్రీనివాస్ ,లక్ష్మి లకు వివాహం జరిగి పది సంవత్సరాలు అయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.కొద్ది రోజులు అత్తారింటి
వద్ద కాపురమున్న లక్ష్మి, ఊర్లో తన తల్లి ఒంటరిగా ఉంటుందని కుటుంబంతో కలిసి ఆ ఊరికి వెళ్లి కాపురంఉంటోంది. అయితే అక్కడే లక్ష్మీ ఆమె భర్త ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు.
సొంతిల్లు నిర్మించుకోవాలని కోరికతో పంచాయితీ వారిని సంప్రదిస్తే వారు ఇంటి స్థలాన్నిమంజూరు చేయడం జరిగింది. ఆ స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకుని ఆ దంపతులిద్దరూ కొత్త ఇంట్లోకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇంతలో అమావాస్య రావడంతో మూడు రోజులు ఆగి కొత్త ఇంట్లోకి వెళ్దామని అనుకున్నారు. ఎందుకంటే ప్రతీ ‘ అమావాస్య ‘ కీ వారి కుటుంబం లో దారుణాలు జరుగుతున్నాయి ,అనే ఉద్దేశ్యంతోకార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
అయితేఆ షెడ్డు వద్ద పనులు ముగించుకొనిఅద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నారు. ఒక్కసారిగా అద్దెకు ఉంటున్నఇంటి గోడ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్, లక్ష్మి దంపతులతో సహా పిల్లలపై సిమెంట్ పెళ్లలు పడడంతో తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఈ సంఘటనలో లక్ష్మి ఒక సంవత్సరం ఉన్న కొడుకు సాయి కుమార్ అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీనివాస్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ముగ్గురు కూతుర్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.