Kadambam: కదంబం, కడిమి మన లో ఈ చెట్టును చాలా మంది చూసే ఉంటారు.. అయితే దీనిలో ఉన్న ఔషధ గుణాల గురించి ఎక్కువ మందికి తెలియదు.. కదంబం పువ్వు లను లలితాదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పూలతో పూజిస్తే ఇష్టకామ్యార్థాలు నెరవేరతాయని ప్రతీతి. కదంబం చెట్టు లో అన్ని భాగాలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే.. ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుందంటే..!?
కడంబైన్, ఆకడంబైన్, బీటా స్టైటో స్టిరాల్ మొదలైన ఆల్కలాయిడ్స్ గుణాలను కలిగి ఉంది. ఈ చెట్టు పండ్లు ఫుడ్ పాయిజన్ ను తగ్గిస్తుంది. రోజుకు ఒక పండు చొప్పున 15 రోజుల పాటు తీసుకుంటే ఫుడ్ పాయిజన్ ను తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిలో, జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే వెంటనే తగ్గిపోతాయి. చెట్టు వేర్లతో కషాయం తయారు చేసుకొని తాగితే మూత్రంలో మంట, మూత్రాశయ ఇన్ ఫెక్షన్స్ ను తగ్గిస్తాయి. ఈ ఆకుల కషాయం తాగితే రుతుక్రమం సమయంలో తీవ్రంగా రక్తస్రావం కాకుండా తగ్గిస్తుంది. కదంబం పండ్లను తినటం వలన బాలింతలలో పాలను వృద్ధి చెందుతాయి. పాలు పడతాయి. ఈ పండ్లను వృద్ధులు తీసుకుంటే నీరసం, నిస్సత్తువ ను తొలగించి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఈ చెట్టు ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి తో పళ్ళు తోముకుంటే దంత సమస్య లను దరి చేరకుండా చేస్తుంది. పంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ఆకులను ముద్దగా నూరుకోవాలి. గాయాలు, పుండ్లు ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. చర్మ సమస్యలను కూడా ఈ ఆకులు తగ్గిస్తుంది. ఈ చెట్టు బెరడు ను పొడి ని రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా రాత్రి పూట రాసుకుని ఉదయం కడిగేస్తే చర్మం పై ఉన్న మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.