కామంతో కళ్ళు మూసుకుపోయిన జంతువులు మన మధ్య ఎంతో మంది తిరుగుతూనే ఉన్నారు. తాజాగా కేరళ లో అలాంటి ఒక వ్యక్తి 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశాడు. ఇక్కడ విషయం ఏమిటంటే నేరస్తుడు ఒక 108 అంబులెన్స్ డ్రైవర్. ఇక అత్యాచారానికి గురైన అమ్మాయి కరోనా పేషెంట్.
వివరాల్లోకి వెళితే… శనివారం రాత్రి ఇద్దరు కరోనా పేషెంట్లు — ఒక ముసలావిడని, 19 ఏళ్ల అమ్మాయిని వేరు వేరు ఆస్పత్రులకి ఒక అంబులెన్స్ డ్రైవర్ తీసుకొని వెళ్తున్నాడు. ఇక 25ఏళ్ల నౌఫల్ మొదట ముసలావిడను ఆసుపత్రిలో వదిలేసి ఆ తర్వాత 19 ఏళ్ల కరోనా వైరస్ పేషెంట్ ని ఎవరు లేని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.
అరన్ముల ఎయిర్ పోర్ట్ దగ్గరలోని ప్రదేశానికి తీసుకు వెళ్లి అక్కడ అ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కరోనా సెంటర్ కి వెళ్ళవలసిన ఆమె ఇలా తన చేతిలో బలైంది. తర్వాత ఆ అమ్మాయిని కోవిడ్ సెంటర్ లో వదిలిపెట్టిన అంబులెన్స్ డ్రైవర్ వెళ్ళి పోయాడు.
ఇక అప్పటి వరకూ తన బంధువుల ఇంట్లో ఉన్న ఆమెకి ఆదివారం కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి వెళ్ళింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి అంబులెన్స్ డ్రైవర్ పైన కేసు పెట్టింది. కేరళ వైద్య శాఖ మంత్రి కే కే శైలజ ఈ ఘటనహురించి తెలుసుకొని తీవ్రమైన షాక్ కు గురయ్యారు. వెంటనే అంబులెన్స్ డ్రైవర్ ను విధుల నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?