Ukraine Russia War: ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఎటు దారి తీస్తుందో ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు. రెండుసార్లు ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినా కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. మరోపక్క రష్యా బలగాలు ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలపై మరియు ప్రభుత్వ భవనాలపై అదేవిధంగా సామాన్య ప్రజలు నివసిస్తున్న నివాసాలపై సినిమా థియేటర్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. క్షిపణి దాడులతో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇండియా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
రష్యా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తూ ఉంటే ఒక్క ఇండియా మాత్రం తటస్థంగా.. ఎటువంటి అభిప్రాయం తెలియ చేయకుండా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. తటస్థంగా వ్యవహరిస్తూనే మరోపక్క రష్యాలో చమురును తక్కువ ధరకు భారత్ కొనుగోలు చేస్తుంది అని తెలిపారు. ఇదే సమయంలో క్వాడ్ గ్రూప్ లో ఇండియా ఉన్న అదే గ్రూప్ లో మిగతా భాగస్వామ్య దేశాలు ఆస్ట్రేలియా అదేవిధంగా అమెరికా, జపాన్, రష్యాను వ్యతిరేకించగా భారత్ ఒక్కటే వ్యతిరేకించకుండా… సమర్థించుకుండా…తటస్థంగా ఉండిపోయింది అని స్పష్టం చేశారు.
రష్యాకు వ్యతిరేకించే విధానాల విషయంలో ఆంక్షలలో ఇండియా భాగస్వామ్యం కాలేదని చెప్పుకొచ్చారు. అదేరీతిలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలో భాగస్వామ్య పక్షం నాటో, యూరప్ యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు ముఖ్యంగా నిలబడటం పట్ల జో బైడెన్ అభినందించారు. అనేక రీతులుగా ఆర్ధిక అంశాలతో రష్యాను కట్టడి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల వ్యవహారం ఒకలా ఉంటే భారత్ వైఖరి రష్యా పట్ల మరోలా ఉందని జో బైడెన్ తాజాగా కామెంట్ లు చేయడంతో.. ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషనల్ గా నిలిచింది.