Russia Ukraine War: అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్- రష్యా మైత్రి బంధం చరిత్రాత్మకం అని చెప్పవచ్చు. చాలా విషయాలలో రష్యా కి భారత్, అదేవిధంగా భారత్ కి రష్యా అండగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం విషయంలో రష్యా అనుసరిస్తున్న విధానంపై అనేక దేశాలు ఖండిస్తున్నాయి. కానీ భారత్ దౌత్యవేత్త ప్రదర్శిస్తూ ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్యా దేశం వద్ద చౌక ధరకే భారత్ ముడి చమురు నీ కొనుగోలు చేయడంతో పాటు సరఫరా చేస్తామని రష్యా ముందుకు రావటం అగ్రరాజ్యం అమెరికా కి కోపం తెప్పించి నట్లయింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడంతో.. పశ్చిమ దేశాలు ఇప్పటికే రష్యా పై అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ మరికొన్ని మిత్ర దేశాలతో వాణిజ్య బంధాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో… ముడి చమురు విషయంలో ఇండియా కి రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే ముడిచమురు సరఫరా చేస్తామని ఆఫర్ ముందుంచింది. ఇదిలా ఉంటే గురువారం రష్యా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేయడానికి వస్తున్న క్రమంలో అమెరికా ఇండియా కి వార్నింగ్ ఇచ్చింది.
రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు పెంచుకోవద్దు అని సూచించింది. అంతమాత్రమే కాదు భారత్ పెద్ద ముప్పును… ఏరికోరి తెచ్చుకుంటుంది అంటూ సైలెంట్ వార్నింగ్ ఇచ్చింది. గతంలో మాదిరిగా దిగుమతులు చేసుకోవాలి తప్ప పెంచుకోవడానికి వీల్లేదు అంటూ అమెరికా.. ఇండియానీ హెచ్చరించడం జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు అనేక రీతులుగా కట్టడి చేస్తూ అమెరికా భావిస్తున్న తరుణంలో.. రష్యా నుండి ముడి చమురు ధర తక్కువ కు భారత్ కొనుగోలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో పెద్దన్న అమెరికా.. సీరియస్ అవ్వటం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.