Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ తాజాగా మరణించారు. నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు మహమ్మారి కి బాగా పని చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చిన సమయంలో ఈ రిటైర్డ్ హెడ్మాస్టర్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ స్థాయిలో ఉన్న సమయంలో .. కారు మీద వచ్చి ఆనందయ్య మెడిసిన్ తీసుకోవటం జరిగింది. వెంటనే చాలా ఆరోగ్యంగా కనిపించారు. తనకు అంతా బాగుందని కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
అయితే అనంతరం ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లెవెల్స్ మళ్ళీ తగ్గిపోవడంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఈనెల 22వ తారీఖు నాటికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు నాటు మందులు కంటి ద్వారా తీసుకోవటంతో కంటిని పరీక్షించిన వైద్యులు సమస్యలు గుర్తించారు. మేటర్ లోకి వెళ్తే కంటిలో టాక్సిక్ కెరటైటిస్ వ్యాధి మొదలైనట్లు తేల్చారు. దీంతో ఈ నెల 23 వ తారీఖున నెల్లూరు జిల్లాలో జిజిహెచ్ లో రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ని జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న సమయంలోనే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదిలారు.
Read More: Corona Breaking: ఒక్క శ్మశానంలో ఇన్ని శవాలా..!? కాటిలో కన్నీరు తెప్పించే దారుణ కథలు..!!
దీంతో కరోనాకు ఆనందయ్య మెడిసిన్ తీసుకున్న సమయంలో కోటయ్య మాట్లాడిన వీడియో ఆయన మరణ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య మెడిసిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. దీంతో కరోనా మందు దొరికింది అనుకున్నా ఆ సమయంలో మందులు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ మరణ వార్త ఏపీ ప్రజలను కన్ఫ్యూజన్ లో పడేసింది.