ఉదయభాను తర్వాత తెలుగులో గ్లామర్ యాంకర్ ఎవరు అంటే అందరూ మొదట అనసూయ పేరే చెబుతారు తన అందంతో, అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న అసూయ ట్రెండింగ్ టాపిక్స్ పై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. అలాగే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేసినా కూడా అవి బాగా వైరల్ అవుతుంటాయి.
చాలాసార్లు అనే సామాజిక అంశాలపై తన ఆవేదనను అనసూయ వ్యక్తం చేయడం చూశాము. ఇక తాజాగా ఈ స్టార్ యాంకర్ ఒక సీనియర్ హీరో చేసిన కామెంట్ కు ఊహించని విధంగా స్పందించింది. వివరాల్లోకి వెళితే చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇంటర్నెట్ లో చాలా మంది అభిమానులు ధోనీ కుమార్తె పై అత్యాచారం చేస్తాం అనేటువంటి వ్యాఖ్యలకు పాల్పడడం అందరికీ తెలిసిందే. దీన్ని చాలా మంది సెలబ్రెటీలు ఖండించారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ కామెంట్స్ చేసిన యువకుడు ని అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇదే విషయంపై తమిళ్ రొమాంటిక్ హీరో మాధవన్ స్పందించారు. పోలీసుల కృషిని ప్రశంసించారు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసే వారికి తగిన బుద్ధి చెప్పాలి అని మాధవన్ అన్నారు. వాళ్లు టీనేజీలు అయినా కూడా వారిని వదిలి పెట్టకూడదు అన్న మాధవన్ కి యాంకర్ అనసూయ తన ట్వీట్ తో మద్దతు పలికింది. నేను కూడా రోజు అలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాను సార్…. ఆన్లైన్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఇలాగే కఠినమైన నిబంధనలు చట్టాలు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను అని అనింది. బలహీనమైన క్షణాల్లో మనం ఉన్నప్పుడు అలాంటి సామెంట్లు వస్తే పరిస్థితి ఏమిటి అని అనసూయ ప్రశ్నించింది.