Animal Faithfulness: మనుషుల కంటే మూగజీవాలకే విశ్వాసం ఎక్కువ అని అందరికి తెలుసు.. అభిమానానికి వెలకట్టగలమా.. విశ్వాసాన్ని కొలవగలమా.. మనుషుల విషయంలో ఏమో కానీ.. మూగజీవాల విషయంలో అయితే సాధ్యం కాదనే చెప్పాలి.. కరోనా నేపథ్యంలో ఎవరైన మరణిస్తే దగ్గరకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు భయపడుతున్న రోజులివి.. అన్నం పెట్టిన వారినే కడతేరుస్తున్న కసాయిలను చూస్తున్నాం.. మానవత్వానికి మచ్చ తెస్తున్న సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్న ఈరోజుల్లో ఒక మూగజీవి తన విశ్వాసం చాటుకుంది.. ఎవ్వరూ దగ్గరకి రాని వేళా అన్ని తానై నిలిచింది.. ఈ విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది..
విశాఖ జిల్లా పద్మనాభం మండలం,మద్ది గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.. నాలుగైదు రోజులుగా తిండిలేక ఓ వృద్ధురాలు మరణించింది. ఆమె చనిపోయి రెండు రోజులు అయినప్పటికీ.. మహమ్మారి కరోనా భయంతో ఎవరు ఆమె వద్దకు వెళ్ళలేదు. అందరూ ఉన్నా అనాధగా మిగిలిపోయింది. అయితే ఆమె పెంపుడు పిల్లి వృద్ధురాలి భౌతికాయాన్ని వదిలి వెళ్ళలేదు.. ఇది చూసిన వారు మనుషుల కంటే మూగజీవాలే నయం అంటున్నారు.. కరోనా వేళా మనుషుల కంటే మూగజీవాలే తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నాయి..