మనం తీసుకునే ఆహారంలో సమతుల్యతను పాటించడం ఎంతో అవసరం. ఆరోగ్యపరంగా మనం తీసుకునే ఆహారం సమతుల్యతను కలిగి ఉంటే శరీరంలోని జీవక్రియలు సరైన మార్గంలో జరుగుతాయి. కానీ కొందరు సరిపడేంత ఆహారం తీసుకొని తక్కువ పరిమాణంలో నీటిని తాగుతూ ఉంటారు. అలాంటి వారు జీర్ణక్రియ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ, ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ ఎంత పరిమాణంలోఆహారం తీసుకోవాలి? నీరు ఎంత తాగాలి అన్న విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక వయసులో ఉన్నవారు కొద్దిగా ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటూ ఉంటారు .అయితే ఆహారం జీర్ణక్రియకు సరిపోయేంత నీటిని తీసుకోవడం ద్వారా జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ప్రతిరోజు సరైన వ్యాయామం చేయడం వల్ల మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. అయితే వ్యాయామం చేసే సమయంలో అధిక నీరు చెమట రూపంలో బయటకు వెళ్లడం వల్ల తొందరగా డీహైడ్రేషన్ కు గురి అవుతారు. అందువల్ల నీటిని అధిక శాతం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.
తాజా సర్వేల ప్రకారం వయస్సు పెరుగుతున్న వారిలో జీర్ణక్రియ రేటు తగ్గి పోతుంది. ఆహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా వారిలో జీర్ణక్రియ సమస్యలు మొదలవుతాయని, అందువల్ల ఎక్కువ పరిమాణంలో నీటిని తాగాలని పరిశోధకులు చెబుతున్నారు. వయసు మళ్ళిన వారు వ్యాయామం వంటివి చేయడం ద్వారా ఎక్కువగా డిహైడ్రేషన్ కి లోనై వారిలో కండరాల నొప్పులు, అధిక ఒత్తిడి కలగడం వల్ల హృదయ స్పందన రేటు అధికమవడం వల్ల కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ కి కారణమయ్యే కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలను సేవించడం ద్వారా అధిక సమస్యలు తలెత్తుతాయి కాబట్టి, వీలైనంత వరకు వీటిని తగ్గించడం ఎంతో శ్రేయస్కరం. అందుకోసమే వయసు పెరిగే కొద్దీ ఎక్కువ శాతం నీటిని సేవించడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.