Audi Car Accident: పీకల దాకా తప్పతాగి.. కారుని యమా స్పీడ్ లో నడిపి.. ఆటోని గుద్దేసి.. ఆపై తప్పించుకోవాలని చూసిన ఏ ఘోరమైన ప్రమాదాన్ని పోలీసులు పసిగట్టేసారు. ఆ నీచపు తండ్రి పోలీసులను ఎంతగా డైవర్ట్ చేయాలనీ చూసినప్పటికీ సీసీ కెమెరాలు నిజం చెప్పేసాయి. అసలు కారణాలు కనిపెట్టేశాయి.. ఇక సాలు విషయంలోకి వెళ్తే… మూడు రోజుల కిందట హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద ఓ ఆడి కారు అతి వేగంగా వస్తూ ఒక ఆటోని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేష్ కుమార్ (పబ్ లో పని చేస్తుంటారు) అక్కడికక్కడే మరణించారు. ఈ కేసుని పక్కదోవ పట్టించేందుకు పెద్ద ప్లాన్ వేసారు. వాస్తవాలను మార్చేశారు.
* ఈ కారుని కారు యజమాని కుమారుడు వాకిటి సుజిత్ నడిపారు. ఆయన స్నేహితులతో కలిసి తెల్లవారుఝామున వరకు మద్యం తాగారు. పొద్దున్న 5 గంటల సమయంలో మద్యం ఆపేసి.. ఇక ఆ మత్తులోనే ఇళ్లకు బయల్దేరారు. అతి వేగంగా కారుని నడుపుకుంటూ ఆటోని ఢీకొట్టారు. ఆటో బోల్తాకొట్టి వ్యక్తి మరణించారు. (ఈ ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది).. అయితే ప్రమాదంతో తేరుకుని.. కొంత దూరం వెళ్లి సుజిత్ తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే సుజిత్ తండ్రి చక్రం తిప్పారు.
* ఆ తర్వాత రోజున తమ డ్రైవర్ ప్రభాకర్ కారుని నడిపారని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదే నమ్మారు. కానీ… ఎందుకో అనుమానం వచ్చి ఆ ప్రమాద స్థలానికి సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆటోని ఢీకొట్టిన తర్వాత కారు కొంత దూరం వెళ్లి… ఆగి.. అక్కడి నుండి నలుగురు యువకులు పారిపోతున్నట్టు చూసారు. కారు డ్రైవర్ గా చెప్పుకున్న ప్రభాకర్ కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. వారి స్టైల్ లో విచారణ మొదలు పెట్టారు. అప్పుడు అసలు కథ బయటకు వచ్చింది. సుజిత్ ని అరెస్టు చేసి.. అతని తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు.