Break Fast: మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. మన ఆహారపు అలవాట్లు కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఏవిధంగా ఆహార నియమాలు పాటిస్తే దానికనుగుణంగా మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.. కొంతమంది ఇది ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తారు.. మరి కొంతమంది రాత్రి భోజనం తిన్న వెంటనే నిద్ర పోతారు.. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి ముప్పెనట.. ఈ అలవాట్లు కొనసాగితే.. తాజా సర్వే ఏం చెబుతుందో చూడండి..!!
ఉదయం అల్పాహారం తీసుకోకపోయినా రాత్రి లేటుగా భోజనం చేసినా నా గుండె పోటు వచ్చే అవకాశం వన్ తాజా సర్వే హెచ్చరిస్తోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల తర్వాతే నిద్ర పోవాలి. రెండు గంటల వ్యవధి కంటే తక్కువగా నిద్రపోకూడదు. తరచుగా ఇంతకంటే తక్కువ సమయంలో నిద్ర పోతూ ఉంటే గుండె జబ్బులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాజా సర్వే ప్రకారం రాత్రి భోజనానికి నిద్ర కి మధ్యలో రెండు గంటల వ్యత్యాసం ఉండాలని సారాంశం ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వారు తెలియజేశారు.
రాత్రి భోజనానికి ఉదయం టిఫిన్ కి మధ్యలో కనీసం 8 నుంచి 10 గంటల వ్యత్యాసం ఉంటుంది. అల్పాహారంలో సాధ్యమైనంత వరకు ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం సమయంలో మనం తీసుకునే ఆహారం మనం రోజంతా ఎంత ఆక్టివ్ గా ఉంటామో నిర్ణయిస్తుంది. అదే బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి అని గుర్తుంచుకోవాలి. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే 58 శాతం గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అదే రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే 51% ముప్పు అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు ప్రివెంటివ్ కార్డియాలజీ అనే జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.