Blood Pressure: ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య లలో అధిక రక్తపోటు ఒకటి. కనీసం 30 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.. మారుతున్న నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు వస్తుంది.. బీపీ ఉన్న వారికి ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ముఖ్యంగా గుండె జబ్బులు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అధిక రక్తపోటు ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన ఔషధ మందులు ఉన్నాయి.. వీటిని వాడితే చాలు బీపీ తగ్గుతుంది..!!
Blood Pressure: బీపీ నియంత్రణలో ఉంచడానికి అద్భుతమైన ఆయుర్వేద మందు..!!
జటామాంశీ వేర్లు 500 గ్రాముల ను తీసుకోవాలి. ఈ వేర్లను మూడు రోజులు మూడు వేరువేరు పదార్థాలలో వేసి నానబెట్టి ఎండబెట్టుకోవాలి. మొదటి రోజు 100 గ్రాములు చింతపండు లో 600 మిల్లీలీటర్లు నీటిలో నానపెట్టి 500 మిల్లీ లీటర్ల రసం తీసుకోవాలి . ఈ రసంలో జటామాంశి వేర్లను వేసి మునిగేలా నానబెట్టి తర్వాత ఆరబెట్టుకోవాలి. రెండవ రోజు పచ్చి దొండకాయ రసం వేసి లో ఈ వేర్లు మునిగేలా చూసి మళ్లీ వాటిని కూడా ఎండబెట్టుకోవాలి. మూడో రోజు ఉల్లిపాయల రసం పోసి అందులో నానబెట్టి తర్వాత వాటిని బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా మూడు రోజులు మూడు వస్తువులలో విడి విడిగా వేసి జటామాంశీ ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయం, రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా పొడిని కలిపి తీసుకుంటే బిపి తగ్గుతుంది. ఈ పొడిని మూడు నెలలపాటు ప్రతిరోజు తీసుకుంటే రక్తపోటు సమస్య తగ్గుతుంది. బిపి వలన వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.
పైన చెప్పుకున్న పద్ధతి కొంచెం కష్టంగా అనిపిస్తే ఈ చిట్కా నీ ప్రయత్నించండి. స్వచ్ఛమైన చందనం చెక్క తీసుకుని శుభ్రమైన రాతిపైన కొద్దిగా పన్నీరు లేదంటే నీరు వేసి చక్కగా బాగా అరగదీయాలి. ఇలా అరగదీసిన గంధాన్ని ఒక చెంచా తీసుకుని అందులో చిటికెడు పచ్చ కర్పూరం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున అలాగే రాత్రి భోజనానికి ముందు తీసుకుంటే బీపీ కంట్రోల్ లోకి వస్తుంది. ఈ తేలికగా చిట్కా రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?