Azaharuddin: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ కౌన్సిల్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్కు నోటీసులు ఇచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీంతో షాక్ తినడం అజారుద్దీన్ వంతు అయింది. అయితే, దీనిపై ఇటు అజారుద్దీన్ అటు హెచ్సీఏ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి.
Read More: corona: కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫర్లు వస్తాయో తెలుసా?
అజారుద్దీన్ ఏమంటున్నారంటే…
తనపై హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ వేటు వేయడాన్ని హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తప్పుబట్టారు. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన అజారుద్దీన్ అంబుడ్స్ మన్ నియామకం సరైనదని హైకోర్టు కూడా చెప్పిందన్నారు. అయితే, హెచ్సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. వాళ్ళ అవినీతికి తాను అడ్డొస్తున్నాననే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. “అదే వ్యక్తులు 25 ఏళ్లుగా ఎందుకు హెచ్సీఏలో ఉన్నారు? ఎవ్వరినీ హెచ్సీఏలోకి ఎందుకు రానివ్వరు? వచ్చినా ఉండనివ్వరు ఎందుకు? బ్లాక్ మెయిల్ చేయడం ఎందుకు? “ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అపెక్స్ కౌన్సిల్లో 9 మంది ఉంటే ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి.. తాము చెప్పిందే వేదంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో జరుగుతున్న… జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తిని అంబుడ్స్మెన్గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పు పట్టారన్నారు.
Read More: Corona: షాక్ః కరోనా టీకా డోసుల మధ్య గ్యాప్ ప్రమాదకరమట…
వారు ఏమంటున్నారంటే…
లోధా సిఫార్సుల నిబంధనల మేరకే నోటీసులు జారీ చేశామని అజార్ వ్యాఖ్యలపై అపెక్స్ కౌన్సిల్ స్పందించింది. ‘ అపెక్స్ కమిటీలో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. అందులో ఒకరు ప్రెసిడెంట్ అజార్. మిగిలిన వాళ్లలో మెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు, ఉమెన్స్ ప్లేయర్ నుంచి ఒకరు ఉన్నారు. మిగతా ఐదుగురే అసలైన అపెక్స్ కమిటీ. ఆ ఐదుగురు తీసుకున్న నిర్ణయమే ఈ షోకాజ్ నోటీసులు. అపెక్స్ కౌన్సిల్లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులం అజార్కు షోకాజ్ నోటీస్ పంపించాం. ఆ ఐదుగురు ఒక గ్రూప్ అని ఆయన అనడం కరెక్ట్ కాదు. ఆ ఐదుగురే అపెక్స్ కమిటీ ఎలెక్టెడ్ బాడీ. ఈ రోజు నుంచి అజారుద్దీన్ ప్రెసిడెంట్ కాదు. ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదు. అజారుద్దీన్ కోర్టుకు వెళ్లి ఫైట్ చేసుకోవచ్చు.“అంటూ తేల్చిచెప్పారు.