Akhanda: మహమ్మారి కరోనా వైరస్ దేశంలో పరిస్థితులను తల్లకిందులు చేసేసింది. పేదవాడు మొదలుకొని సెలబ్రిటీ వరకు ఈ మహమ్మారి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి కావడంతో పాటు.. ప్రభుత్వాలకు ఇది ఒక కొత్త సవాలు కావటంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో వ్యవస్థ మొత్తం స్తంభించడంతో భారీగా నష్టాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగానికి అయితే గత ఏడాది నుండి భయంకరమైన నష్టాలు. మహమ్మారి వల్ల ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తూ ఉండటంతో థియేటర్ ని క్లోజ్ అయిపోవడంతో.. సినిమా కంప్లీట్ అయినా గాని విడుదల చేయలేని పరిస్థితి.
మరోపక్క సినిమా నిర్మాత సినిమా కోసం పెట్టిన పెట్టుబడి.. తడిసి మోపెడు అయ్యే రీతిలో ఆర్థిక కష్టాలు ఏర్పడుతూ ఉండటంతో ఈ మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ కలిగిన సినిమాల నిర్మాతలు ఓ టి టి లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఓ టీటీలో స్టార్ హీరోల సినిమాలు.. రిలీజ్ చేస్తే పెద్దగా లాభం ఉండే ప్రసక్తి ఉండటంతో.. థియేటర్ లో ఓపెన్ అయ్యేవరకు వెయిట్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం బయట పరిస్థితి చూస్తే ఈ ఏడాది చివరి వరకు… థియేటర్లు ఓపెన్ కానీ పరిస్థితి ఏర్పడటంతో పాటు చైనాలో మరో కొత్త వైరస్ వేరియంట్లు బయట పడినట్లు వార్తలు రావడంతో ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Akhanda: సంచలనం సృష్టించిన అఖండ టీజర్..!!
ఈ క్రమంలో బాలయ్య సినిమాకి కూడా తిప్పలు ఉన్నట్టు ఫిలిం వర్గాలలో వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం “అఖండ” సినిమా కూడా ఓటిటి లో రిలీజ్ చేయాలని.. సినిమా నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. సినిమా కంప్లీట్ అయిపోవడంతో పాటు.. భారీ బడ్జెట్ కావడంతో నిర్మాతలు… నష్టపోకుండా సినిమా యూనిట్.. ఓటిటి లో ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు డిస్కషన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు.. బాలయ్య బోయపాటి సినిమా అంటే అది థియేటర్లో చూస్తేనే కిక్కు వేరేగా ఉంటది అంటున్నారు. మరి బాలయ్య బాబు అఖండ.. ఓటిటి లో రిలీజ్ అవుతుందో లేకపోతే థియేటర్ లో రిలీజ్ అవుతుందో చూడాలి.