Balakrishna: బాలయ్య బాబు జోష్ లో ఉంటే అది రాజకీయ వేదిక అయిన లేకపోతే సినిమా వేదిక అయిన వాతావరణం ఓ రేంజ్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. సాధారణంగా చాలావరకు బాలయ్యకి కోపం ఎక్కువ అని బయట నానుడి. అటువంటి బాలయ్య “ఆహా” ఓటిటి హోస్ట్ గా ఓ టాకీ షో చేయటం ఆ షో ఇండియాలోనే హైలెట్ అవటం తెలిసిందే. అన్ స్తాపబుల్ అనే షో…కి యాంకరింగ్ చేసిన బాలయ్య బాబు చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ ప్రశ్నలతోపాటు కామెడీ కూడా బాలయ్య పండించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఆ షో గతంలోనే ముగిసిపోయింది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ బాలయ్య బాబు ఆహా వేదికపై రావడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం సెమీ ఫైనల్స్ కి… ముఖ్య అతిథిగా బాలకృష్ణ రావడం జరిగింది. ఈ సందర్భంగా స్టేజి పై తనదైన శైలిలో చిందులేసి అలరించారు. సెమీ ఫైనల్స్ పోటీదారులతో సరదా సంభాషణ చేస్తూ ఒక సింగర్ తో.. బాలయ్య బాబు మాట్లాడుతూ “పెళ్లి ఎప్పుడు అని అడగను… ఎందుకయ్యా పెళ్లి అంటాను”.. అని భార్యను ఎలా మార్చడం అనే పుస్తకాన్ని బాలయ్య బాబు బహుమతిగా ఇచ్చారు.
ఈ సందర్భంగా స్టేజి ఫై న్యాయ నిర్ణీత స్థానంలో కూర్చున్న బాలయ్య… ఈ ప్రోగ్రామ్ తన భార్య వసుంధర చూడకుండా షో వాళ్ళు జాగ్రత్త పడాలని చూస్తే నాకు దబిడి దిబిడే.. అనటంతో అక్కడ వాళ్ళు అంత నవ్వుకున్నారు. అనంతరం మరో సింగర్ నీ చూసి ఏమయ్యా ఇక్కడ వాళ్ళంతా కొత్త కంటెస్టెంట్ లు అన్నారు. మరి .. పాడటానికి పూజా హెగ్డే ఎలా వచ్చింది అంటూ.. ఫిమేల్ సింగర్ కంటెస్టెంట్ అందాన్ని పొగుడుతూ.. బాలయ్య సంచలన కామెంట్ చేశారు. ఈ కార్యక్రమం జూన్ పదవ తారీకు ఆహా లో… స్ట్రీమింగ్ కానుంది.